6 years ago janammata 0
కర్నూల్ జిల్లాలో తెలుగు తమ్ముళ్లు ఇసుక కోసం కొడవళ్ళతో నరుక్కున్నారు.
ఒకరిపై మరొకరు కొడవళ్ళతో దడి చేసుకున్నారు. ఈ గొడవలో కృష్ణుడు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ అతనిని కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెలో ఇసుక దందా కొనసాగుతోంది. దందాలో అధికార పార్టీ కి చెందిన వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది.ఇంటి మరుగు దొడ్ల పనులకని ఇసుక తీసుకుపోతున్న వ్యక్తిని టీడీపీ ఎంపీపీ వర్గానికి చెందిన వారు అదే పార్టీ లోని జ్ఞానేశ్వర్ గౌడ్ వర్గానికి చెందిన కృష్ణుడు, నరేష్ లను కొడవలి ,రాడ్డులతో దడి చేసారు. ఈ దాడిలో కిట్టు అనే వ్యక్తి గాయపడ్డాడు. అతనిని కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. MPP భర్త అనుచరులo,మండలం అంతా మాదే.. మాకు అడ్డు వస్తే ఎవరిని వదలమని.. ఇక్కడ కోట్ల రూపాయల ఇసుక డంపులున్న ఏ అధికారులు ఇక్కడకు రారు అంటూ దాడికి పాల్పడ్డారని దాడిలో గాయపడ్డ కృష్ణుడు అంటున్నాడు.