ప్రైవేట్ కాలేజెస్ లో రిజర్వేషన్స్ రద్దు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం

6 years ago janammata 0

 

 

ప్రైవేట్ కాలేజెస్ లో రిజర్వేషన్స్ రద్దు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేశారు. ఈ నిర్ణయంపై ఏ ఒక్కరు  కూడా మాట్లాడకుండా ఆయన వివరణ ఇచ్చారు. యూపీలోని అన్ని ప్రైవేట్ వైద్య కాలేజీల్లో రిజర్వేషన్లను ఎత్తివేశారు. ప్రైవేట్ కాలేజీలకు వెళ్లే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రైవేట్ వైద్య కాలేజీలకు వెళుతున్నారంటే ఖచ్చితంగా వారు ధనవంతులై ఉంటారని, అలాంటివారికి రిజర్వేషన్లు ఎందుకంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కానీ, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రం ఈ రిజర్వేషన్లు యధావిధిగా కొనసాగిస్తామని తెలిపారు.

మరోవైపు ట్రిపుల్ తలాక్‌పై ఆయన మాట్లాడారు. ట్రిపుల్ తలాక్‌పై మౌనం వహించడదం ద్రౌపది మానభంగం వంటిదేనని అన్నారు. ట్రిపుల్ తలాక్ కు స్వస్తి పలకాలని, దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని ఆయన గట్టిగా కోరారు. ట్రిపుల్ తలాక్‌పై ప్రజలు మౌనం వహించడాన్ని చూస్తే తనకు మహాభారతంలోని కథ గుర్తుకు వస్తుందని ఆయన అన్నారు.